నిజమేనా? పీకే కోసం పాక్ సాయం!

January 16, 2016 | 02:24 PM | 1 Views
ప్రింట్ కామెంట్
subramanian-swamy-about-aamir-khan-PK-pak-ISI-niharonline

మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ పై ఇటీవల నేతలంతా వరుసగా విరుచుకుపడుతున్నారు. దేశంలో ‘అసహనం’పై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ‘‘దేశం వదిలి వెళదామంటూ నా భార్య చెప్పింది’’ అంటూ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు పెను కలకలాన్నే రేపాయి. ఫలితంగా ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఆమీర్ ఆ హోదాను కోల్పోయే స్టేజికి దిగజారాడు. ఈ క్రమంలో బీజేపీ నేతలంతా క్యూ కట్టి మరీ అమీర్ ను తిడుతున్నారు.

శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అతడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ముందుగా నీ భార్యకు చెప్పుకో’ అంటూ ఆమిర్ పై రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. తాజాగా సుబ్రహ్మణ్యస్వామి రంగంలోకి దిగారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆమిర్ పై విరుచుకుపడ్డారు. కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు.

గతంలో అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘పీకే’ ప్రమోషన్ కోసం ఆమీర్, పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సహకారం తీసుకున్నాడని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. అందుకే పాక్ లో చిత్రం యధేచ్ఛగా ప్రదర్శితమైందని, ఆ పెట్టుబడులతోనే భారీ లాభాలను రాబట్టిందని విమర్శించాడు. ఆదరించి అన్నంపెట్టిన స్వదేశం గురించి అసలు అలా మాట్లాడటానికి అమీర్ కు నోరు ఎలా వచ్చిందని ఆయన మండిపడ్డారు. మరి దీనిపై ఆమీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ