టీ సర్కార్ కు చావు డప్పుల ‘మోత’కపల్లి

March 09, 2015 | 03:12 PM | 44 Views
ప్రింట్ కామెంట్
MOTHUKUPALLY_NARASIMHUL_FIRE_ON_KCR_NIHARONLINE

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా మండిపడ్డారు. మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు చోటుకల్పించలేదంటూ టీటీడీపీ నేతలు సోమవారం ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నేత మోత్కుపల్లి తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ సర్కారుకు చావుడప్పు ఎలా కొట్టాలో తాను చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వంటి వారు దళితులను నిత్యం వంచిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. శాసనసభలో కేసీఆర్ దొరతనం ప్రదర్శిస్తున్నారని, ఆయన గొంతు మూగబోయే సమయం వచ్చిందని ఆయన అన్నారు. మోసాలను ఎదుర్కొనే సత్తా ఒక్క టీటీడీపీకి మాత్రమే ఉందని ఆయన ఉద్ఘాటించారు. అసెంబ్లీ సాక్షిగా నేతలపై దాడి జరుగుతున్న సీఎం పదవిలో ఉండి ఆయన కిక్కురుమనకుండా ఉన్నారని, సభ్యుల సస్పెన్షన్ పక్కా ప్రణాళికతో జరిగిందని ఆయన ఆగ్రహాం వ్యక్తంచేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ