ఏపీ అసెంబ్లీ సాక్షిగా దూషణల పర్వం

March 18, 2015 | 12:40 PM | 62 Views
ప్రింట్ కామెంట్
bonda_uma_kodalinani_niharonline

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిట్లపురాణం ఓ రేంజ్ కి చేరింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంలో దూషణల పర్వం కొనసాగింది. సభ అనే విచక్షణ లేకుండా, ప్రజలు చూస్తున్నారనే విషయాన్ని మైమరిచి నేతలు ఒకరిపై ఒకరు తిట్ల దండకం వల్లించుకున్నారు.  విపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార సభ్యులు గోరంట్ల బుచ్చయ్య, బోండా ఉమా మహేశ్వర రావులు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. బోండా ఉమ మాట్లాడుతూ... కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(కొడాలి నాని), రోజాలను ఐరెన్ లెగ్ లుగా అభివర్ణించారు. దీంతో కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రసంగం మధ్యలోనే ఆగ్రహోదగ్రుడైన బోండా ఉమ‘‘రేయ్ ... ఎంట్రా మాట్లాడేది. నీ అంతు చూస్తా... వేలాడదీస్తా అంటూ ఊగిపోయారు. ఈ వ్యాఖ్యలు మైక్ లో బిగ్గరగా వినిపించటంతో సభ దద్దరిల్లింది. సభ అదుపు తప్పడంతో స్పీకర్ కోడెల 15నిమిషాలు వాయిదా వేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ