చంద్రన్న కానుకతో ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?

January 22, 2016 | 02:49 PM | 1 Views
ప్రింట్ కామెంట్
crores of public money wasted by chandranna kaanuka niharonline

పండగ పూట పేదల ఇంట తృప్తికరమైన భోజనం ఉండాలన్న లక్ష్యంతో, ఏపీలోని 1.40 లక్షల రేషన్ కార్డుదారులకు పంచాలని ప్రతిపాదించి తయారు చేసిన పథకం 'చంద్రన్న కానుక'. ఓవైపు అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ కానుకలు అందలేదన్న వార్తలు వస్తున్న తరుణంలో దాదాపు 17 లక్షల ప్యాక్ లు మిగిలిపోవడం గమనార్హం. దీని ద్వారా పెద్ద మొత్తంలో దాదాపు రూ. 47 కోట్ల ప్రజాధనం వృథా అయినట్లు తెలుస్తోంది. ఈ నెల ఏడో తేదీ నుంచి పండగ వరకూ వీటిని పంపిణీ చేయగా, మధ్యలో కొన్ని రోజులు సర్వర్ల జామ్ కారణంగా పంపిణీ జరగలేదు. అప్పట్లో వీటిని ఉచితంగా ఇచ్చారు. పండగ తరువాత వీటిని అమ్మాలని చూస్తే, ముందు ఉచితంగా ఇచ్చిన సరుకులను డబ్బులకు అమ్ముతున్నారన్న చెడ్డ పేరు వస్తుందని అధికారులు వెనుకాడుతున్నారు. అంతేకాదు కొంత మంది అధికారులు చేతి వాటం ప్రదర్శించి వీటిని తమిళనాడుకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తక్కువ రేటుకే వీటిని అమ్ముకుని సోమ్ము చేసుకుంటున్నారని సమాచారం.

                                 మరోవైపు లక్షలు విలువ చేసే బెల్లం, కందిపప్పు, గోధుమ పిండి, నెయ్యి, పామాయిల్, శనగపప్పు వంటివి ఉన్నాయి. తక్షణం వీటిని పంచకుంటే, సరుకులు పాడైపోతాయన్న భయాలూ ఉన్నాయి. ఒక్కో ప్యాక్ విలువ రూ. 275 అన్న సంగతి తెలిసిందే. మిగిలిన ప్యాకెట్లను స్టాక్ పాయింట్లకు పంపాలని కోరితే, దానికి అదనంగా ఖర్చయ్యే రవాణా ఖర్చు ఎవరు భరించాలని రేషన్ షాపు డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తుండటంతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నాకే వీటిని ఏం చేస్తారన్నది తెలుస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ