సంక్రాంతి సంబరాలకు గుర్తింపునిచ్చారు

January 10, 2015 | 04:47 PM | 30 Views
ప్రింట్ కామెంట్

సంక్రాంతి సంబరాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపు కల్పించినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ, ముగ్గులు, గాలిపటాలు, వంటలు వంటి తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గెలుపొందిన వారికి ప్రభుత్వం తరపున అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు ఆయన అన్నారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో తిరుపతిలో ‘సంక్రాంతి సంబరాలు’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వలక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ