నేడు ఏపీలో కేంద్ర బృందం పర్యటన

November 25, 2014 | 11:30 AM | 39 Views
ప్రింట్ కామెంట్

హుద్ హుద్ తుఫాన్ ప్రభావిత జిల్లాలో పర్యటించేందుకు కేంద్ర బృందం నేడు ఏపీకి రానుంది. తుఫాన్ దాటికి తీవ్రంగా నష్టపోయిన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనుంది. కేంద్రం ప్రకటించిన రూ.1,000 కోట్ల ఆర్థికసాయంలో ఇప్పటి వరకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే అందింది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. దీంతో స్పందించిన కేంద్రం అధికారులతో కూడిన బృందాన్ని రాష్ర్టానికి పంపుతుంది. ఈ మూడు రోజుల్లో నష్ట తీవ్రతను అంకెల్లో చేర్చి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ