ప్రొటోకాల్ చిచ్చు: ఆ ఎంపీగారు అలిగారు

January 20, 2015 | 02:22 PM | 41 Views
ప్రింట్ కామెంట్

విశాఖపట్నం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అలిగారండీ. ఎవరీ మీద అనుకుంటున్నారా? ఇంకెవరి మీద ఏపీ మంత్రుల మీద. కారణమేంమనుకుంటున్నారా?. ప్రోటోకాల్ నిర్వాకం. విశాఖలో మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హోదాలో హరిబాబును ఆహ్వానించినప్పటికీ ఆయనను స్టేజీ మీదకు మాత్రం ఆహ్వనించలేదట. దీంతో ఒక్కసారిగా అగ్రహోదగ్రుడైన హరిబాబు, అక్కడే మంత్రులను, అధికారుల దునుమాడారట. పొరపాటు జరిగింది. క్షమించి వేదికెక్కండన్న మంత్రులు, అధికారుల విన్నపాన్ని తిరస్కరించి ఆయన అక్కడినుంచి వెళ్లిపోయారట. అలిగిన హరిబాబు ను బుజ్జగించేందుకు మంత్రి గంటా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ