మహేష్, బాలయ్యలను కిడ్నాప్ చేసిన మావోలు

October 06, 2015 | 04:34 PM | 9 Views
ప్రింట్ కామెంట్
maoists-kidnap-three-AP-TDP-leaders-in-Vizag-niharonline

మహేష్, బాలయ్యలు నిజంగానే మావోయిస్టుల చెరలో ఉన్నారు. కానీ, వీళ్లు వాళ్లు కాదు. విశాఖ టీడీపీ నేతలు లేండి. తమకున్న నెట్ వర్క్ సాయంతో ఓ ముగ్గురు టీడీపీ నేతలను దార్ కొండ గ్రామానికి రప్పించారు. అనంతరం వారిని కిడ్నాప్ చేశారు.  వీరంతా జికె వీధి మండలానికి చెందిన టిడిపి నేతలని డీఎస్పీ ప్రవీణ్ తెలిపాడు. సోమవారం రాత్రి వీరిని కిడ్నాప్ చేసిన మావోలు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.

కిడ్నాపైన వారిలో మండల టిడిపి అధ్యక్షుడు మామిడి బాలయ్య, సీనియర్ నాయకుడు బాలయ్య, మహేష్‌లు ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ఏవోబి కమిటీ ప్రకటించింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను విరమించుకోని పక్షంలో తాము తీవ్ర చర్యలకు దిగుతామని మావోయిస్టులు ప్రకటించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించకుంటే టిడిపి నేతలను ప్రజా కోర్టులో శిక్షిస్తామని మావోయిస్టులు స్పష్టం చేశారు. ఇక తమ టీంలతో రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతామని డీఎస్పీ ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ