టీ మంత్రి వ్యాఖ్యలు అనాగరికం: గంటా

December 31, 2014 | 12:41 PM | 45 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అనాగరికంగా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్ని వివాదం నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన గంటా... జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని తాము రెండడుగులు తగ్గితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బిగదీసుకుని కూర్చుందని ఆయన ఆరోపించారు. ఏపీ విద్యార్థలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. నిన్నటి భేటీ సందర్భంగా ఎంసెట్ నిర్వహణ ఏపీ పరిధిలోకే వస్తుందన్న గవర్నర్ వాదననూ పట్టించుకోకుండా జగదీశ్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని గంటా విమర్శించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ