వారు గాడ్సే వారసులన్న రఘువీరా

December 29, 2014 | 03:52 PM | 23 Views
ప్రింట్ కామెంట్

జాతిపిత మహాత్మా గాంధీని క్రూరంగా హత్య చేసిన నాధూరాం గాడ్సేకు గుడికట్టాలని కొందరు యత్నిస్తుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ పార్టీ కి మద్ధతిస్తున్న టీడీపీలు దాన్ని వ్యతిరేకించటం లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. టీడీపీ, బీజేపీ నేతలు గాడ్సే వారసులని ఆయన ఎద్దేవా చేశారు. ఆ మధ్య అయితే కొందరు బీజేపీ నేతలు నెహ్రూని కూడా గాడ్సే చంపి ఉండాల్సిందని బహిరంగంగానే కామెంట్లు చేశారని గుర్తు చేశారు. ఇండియాలో ముస్లిం, క్రిస్టయన్లను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. రాజధాని నిర్మాణ గ్రామాలలో అగ్ని ప్రమాదాలు సంభవించటం విచారకరమని, దోషులను 24 గంటల్లోపు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ