మాక్ అసెంబ్లీతో జగన్ ముచ్చట తీర్చుకోవచ్చట

January 12, 2015 | 04:25 PM | 29 Views
ప్రింట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై ఆ రాష్ట్ర ఉఫముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సెటైర్లు వేశారు. ముప్ఫై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానన్న జగన్ వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ... మూడు రోజులైనా సీఎం సీటులో కూర్చోవాలని జగన్ ఆశపడుతున్నట్లు ఉన్నారని, కావాలంటే మాక్ అసెంబ్లీ పెట్లుకుని అందులో ముఖ్యమంత్రి పాత్ర పోషించి ఆ ముచ్చట తీర్చుకోవచ్చునని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉన్న ఆ సీట్లనైనా దక్కించుకునే ప్రయత్నం చేసుకోవడం మంచిదని, ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కల కలగానే మిగిలిపోతుందని చెప్పారు. రాష్ట్ర ప్రగతికి సహాకరించాల్సిందిపోయి వైసీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తూ పరువు తీసుకుంటున్నారని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ