చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు

December 08, 2014 | 02:47 PM | 73 Views
ప్రింట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సెటైర్లు వేశారు. రాజ్యాంగం అనుమతిస్తే సింగపూర్ వాసులను కూడా బాబు తన మంత్రివర్గంలో చేర్చుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని విమర్శించారు. రైతులను దొంగలుగా చిత్రీకరించడం ఆయనకు తగదని రామకృష్ణ సూచించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా రుణాలన్నీ మాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒక పైసా మాఫీ చేయకుండానే చంద్రబాబు సన్మానాలు చేయించుకుంటున్నారని రామకృష్ణ చురకలంటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. అటు, ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి సాధించడంలోనూ చంద్రబాబు విఫలమయ్యారని రామకృష్ణ విమర్శించారు

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ