గేట్ వే ఆఫ్ ఇండియా ఏపీ అంటున్న చంద్రబాబు

January 09, 2015 | 01:19 PM | 39 Views
ప్రింట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్ దేశానికే గేట్వే లాంటిదని మరియు ప్రతి గ్రామాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని, వచ్చే నెల నుంచి ఈ-బిజ్ను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుజరాత్లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ సూర్యోదయ రాష్ట్రమని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల వల్ల దేశానికి గుర్తింపు వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో మెగా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ