కూడంకుళం నుంచి ఏపీకి విద్యుత్

January 08, 2015 | 05:26 PM | 27 Views
ప్రింట్ కామెంట్

కూడంకుళం విద్యుత్ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు 50 మెగావాట్ల విద్యుత్ కేటాయిస్తున్నారని టీడీపీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ లేఖ పంపారని చెప్పారు. ఢిల్లీలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్యాస్, థర్మల్ విద్యుదుత్పత్తికి సంబంధించి కోల్ లింకేజీని పెంచాలని కోరామన్నారు. ఈ నెల 12న ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారని వెల్లడించారు. జపాన్, సింగపూర్ ప్రతినిధులతో చర్చల తర్వాత ఏపీ రాజధాని విషయంలో స్పష్టత వస్తుందన్నారు. పుట్టపర్తి విమానాశ్రయాన్ని వినియోగించుకోవాలని విమానాయాన శాఖను కోరామని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను ఈ నెల 15న కేంద్రం ద్రుష్టికి చంద్రబాబు తీసుకెళతారని వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ