భూమాకు బెయిల్ మంజూరు

November 22, 2014 | 10:57 AM | 45 Views
ప్రింట్ కామెంట్

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. నంద్యాల మున్సిపల్ సమావేశంలో జరిగిన గొడవలో ఆయనపై నమోదైన కేసులో శుక్రవారం నంద్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు, ఏడుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పాటు మరో 12 మందికి కూడా బెయిల్ మంజూరు అయ్యింది. గత నెల 31న నంద్యాల పురపాలక సంఘ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన అనుచరులు 19 మంది తనపై హత్యాయత్నం చేసినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో భూమా నాగిరెడ్డితో పాటు మిగిలిన నిందితులు నవంబర్ ఒకటో తేదీన పోలీసుల సమక్షంలో హాజరవగా కోర్టు రిమాండ్ విధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ