రివర్స్ జంప్ తో ఏం లాభం అక్కా?

December 01, 2014 | 05:06 PM | 42 Views
ప్రింట్ కామెంట్

జనరల్ గా ఎన్నికల ముందు గెలుస్తుందన్న పార్టీల్లోకి జంపింగ్ లు ఉంటాయి. ఎలక్షన్ అయ్యాక గెలిచిన పార్టీల్లోకి వలసలు ఉంటాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నేతలు ఇదే సూత్రం ఫాలో అవుతూ ఇటు తెలంగాణలో టీఆర్ఎస్, అటు టీడీపీ చేరిపోతున్నారు. కానీ, ఇదేం విచిత్రమో గానీ. టీడీపీ మహిళా విభాగం నేత, అనంతపురంకు చెందిన ఉషాశ్రీ చరణ్ మాత్రం వెరైటీగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీలో చేరి అందరికి షాక్ ఇచ్చారు. సోమవారం లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఆమె వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఏపీలో వైఎస్సార్సీపీ ఖాళీ అవుతుందన్న వారి వ్యాఖ్యలకు అధినేత జగన్ ఈ రకంగా దీటైన సమాధానం ఇచ్చారని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అది వారి వరకు బాగానే ఉంది. అసలు అధికార పక్షంలో ఉన్న టీడీపీని వదిలి ఉషాశ్రీ ఎందుకు ఇందులో చేరారా అనే ప్రశ్న రాజకీయ వర్గాలలో ఇప్పుడు హట్ టాపిక్ అయ్యింది. భవిష్యత్ లో అక్కడ టీడీపీయే అధికారంలోకి వస్తుందని జనాలు చర్చించుకుంటే బిచాణా ఎత్తేస్తున్న పార్టీలోకి ఎందుకు వెళ్లిందా అంటూ తెలుగు తమ్ముళ్లు నవ్వుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ