ప్రియుడితో కలిసి తిన్న ఇంటి వాసాలు...

September 19, 2015 | 03:22 PM | 1 Views
ప్రింట్ కామెంట్
TheLove_Birds_niharonline

ప్రస్తుతం యువతీ యువకుల మధ్య ప్రేమాయనాలు మిన్నంటుతున్నాయనే సమాచారం వింటూనే ఉన్నాం. అయితే ఈవీడ కాస్త మితిమీరి పోయి తన ప్రియుడి అవసరాలను తీర్చే తపనలో నిమగ్నమైపోయి ఒక్కొక్కటిగా తన నగలను స్వాహా చేసింది. ఇది గమనించే సరికే ప్రియుడితో కలిసి తిన్న ఇంటి వాసాలే లెక్కపెట్టింది ఒక భార్య. అసలు వివరాల్లోకి వెలితే... గుడివాడలోని జ్యోతి అనే యువతికి ముడిలి వేణుబాబుతో వివాహేతర సంబంధం ఉంది. వేణు అవసరాలకు జ్యోతి స్పందించి తన బంగారు నగలను ఇస్తూ వచ్చింది. వేణు వాటిని ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెడుతూ వచ్చాడు. పండుగ సందర్భంగా తన అత్త ఇంటివారు నగలను అడుగుతారు వాటిని విడిపించమని కోరిన ప్రియురాలికి చేదు జవాబు ఇచ్చాడు వేణు... నా వద్ద డబ్బు లేదు విడిపించడానికని.

తీవ్రంగా ఆలోచించి వీరిద్దరూ ఒక వ్యూహం రచించారు. వేణు తన బావ మరిదితో కలిసి జ్యోతి ఇంట్లోకి దీపావళి పిస్టల్ మరియు కత్తులతో ప్రవేశించి, భర్తను బెదిరించి డబ్బు దోచుకుని నగలు తీసుకెళ్లినట్లు నటించారు. మరునాడు భర్తతో కలిసి ఆమెకుడా పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు తప్పకుండా నన్ను పట్టుకంటారని తలంచిన  ప్రేమికుడు పురుగుల మందు సేవించాడు. ఇంకేం తాను పన్నిన వలలో తనే చిక్కుకున్నట్టుగా పోలీసులు కూపీ లాగడంతో కథ వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయం వివరించారు. అంతే ఇక ప్రేయసీ ప్రియులు ఊచలు లెక్కపెడుతున్నారు. బావ మరిది పరారిలో ఉన్నాడు. తనని పోలిసులు గాలిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ