ప్రత్యేక హోదా పరిశీలనలో ఉందన్న కమలం బాస్

January 09, 2015 | 04:44 PM | 22 Views
ప్రింట్ కామెంట్

ఆంధ్రప్రదశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఏపీ బీజేపీ పదాధికారులతో విజయవాడలో సమావేశం షా మీడియాతో మాట్లాడారు. ఏపీలో 10 లక్షల సభ్యత్యాల నమోదును లక్ష్యంగా నిర్దేశించామన్నారు. తమ విధానాలు నచ్చి పార్టీలో చేరేవారికి ఆహ్వానం పలుకుతామని చెప్పారు. రాష్ట్రానికి సహాయం అందించటంలో కేంద్రం ఎప్పుడూ ముందుంటుందని ఉద్ఘాటించారు. అన్ని రాష్ట్రాలలో బీజేపీని విస్తరించటానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ద్రవ్యోల్బణం సున్నా శాతానికి రావటం మోదీ ప్రభుత్వం ఘనతేనని పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ