ఏపీలో డీఎస్సీ గడువు 21 దాకా

January 17, 2015 | 10:24 AM | 40 Views
ప్రింట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ రాస్తున్న అభ్యర్థులకు శుభవార్త. డీఎస్సీ దరఖాస్తు తుది గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడువును ఈ నెల 22 వరకు పెంచినట్టు ఏపీ విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. ఈ నెల 21 వరకు ఇంటర్నెట్ లో రుసుము చెల్లించేందుకు అవకాశం ఉందని తెలిపారు. వరుసగా సెలవులు రావటంతో గడువు పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో డీఎస్సీ అభ్యర్థులకు కాస్త ఊరట లభించినట్లైంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ