బాబును చూసి బిల్ గేట్స్ ఆపుకోలేకపోయారట

January 23, 2015 | 05:05 PM | 80 Views
ప్రింట్ కామెంట్

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుండటంతో ప్రపంచ ఆర్థిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలందరూ విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశారట. సదస్సులో చంద్రబాబును చూసి గేట్స్ ఉద్వేగభరితుడయ్యారట. బాబుతో కరచలనం చేసి, పదేళ్ల తర్వాత కలిశామంటూ అప్యాయత ప్రదర్శించారట. అంతేకాదు తిరిగి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసి ఎంతో సంతోషించానని కూడా బాబుతో చెప్పారట. ఈ సందర్భంగా ఏపీలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ సిటీ ల రూపకల్పనకు సహకరించాలని చంద్రబాబు ఆయనకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. పనిలో పనిగా చంద్రబాబును బిల్ గేట్స్ విందుకు ఆహ్వనించారని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ