ఏపీలో ఆరు మండలాలకు మహర్ధశ

January 22, 2015 | 11:10 AM | 48 Views
ప్రింట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్ లోని ఆరు మండలాలకు త్వరలో మహర్దశ పట్టనుంది. గుంటూరు జిల్లాలోని ఆరు మండలాలను ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు దత్తత తీసుకున్నాయట. ఈ విషయాన్ని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. గుంటూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ... ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకులు దత్తత తీసుకున్న ఆరు మండలాల్లో పౌష్టికాహారం, మరుగుదొడ్లు, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకరిస్తాయని అన్నారు. ఆరు మండలాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ