మోసం చేశాడని యాసిడ్ పోసేసింది

December 20, 2014 | 03:54 PM | 39 Views
ప్రింట్ కామెంట్

ప్రేమ పేరిట మోసం చేసిన లెక్చరర్ పై ప్రతీకారం తీర్చుకుందో యువతి. గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలో పని చేస్తున్న వెంకటరమణ అనే లెక్చరర్ పై అదే కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని యాసిడ్ తో దాడి చేసింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ లెక్చరర్ వెంకటరమణను జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంకటరమణ మోసం చేశాడని ఆ యువతి ఆరోపించింది. వేరే పెళ్లి చేసుకున్నాడని, తనకు జరిగిన అన్యాయానికి ప్రతిగా తాను దాడికి పాల్పడ్డానని ఆమె చెప్పింది. మగాళ్లు మగువలపై మోజు పారేసుకోవడం సహజమే. ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని లేకపోతే యాసిడ్ దాడులు చేస్తామని బెదిరించడం మమూలే. ఇష్టపడిన అమ్మాయిలు తమ ప్రేమను నిరాకరిస్తే అబ్బాయిలు యాసిడ్ దాడులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ విద్యార్థినే లెక్చరర్‌పై యాసిడ్ దాడి చేయడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ