కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు కన్నుమూత

January 19, 2015 | 10:32 AM | 43 Views
ప్రింట్ కామెంట్

కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు(75) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పాలడుగు మృతి పట్ల కాంగ్రెస్ నేతలు, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పాలడుగు స్వస్థలం కృష్ణా జిల్లా ముసనూరు మండలం గోగులంపాడు గ్రామం. 1968లో యువజన కాంగ్రెస్‌లో చేరిన పాలడుగు 1972లో తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నూజివీడు శాసనసభ స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, నేదురుమల్లి కేబినెట్‌లో పాలడుగు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పాలడుగు వెంకట్రావు ప్రస్తుతం ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు. నేదురుమల్లి జనార్ధన్ కేబినెట్ లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సిగా ఉన్నారు. విభజన తర్వాత ఏపి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సిగా కొనసాగుతున్నారు. స్వతహాగా పాలడుగు ధనవంతుడు, భూస్వామి అయినప్పటికీ ఆ దర్పం ప్రదర్శించకుండా సామన్య జీవితం గడిపేవాడు. ప్రజలకు సేవచేయటంలోనే అసలైన ఆనందం ఉందని ఆస్తులను పక్కనబెట్టేశాడు. సోషలిస్టు విధానాలు పాటించే పాలడుగు పిల్లలను కూడా వద్దనుకుని జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. తన ఆస్తులు కూడా ప్రజలకే చెందేలా వ్యవహరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ