దారుణం: సహాజీవనం ఆపై సజీవ దహనం

March 13, 2015 | 12:20 PM | 57 Views
ప్రింట్ కామెంట్
man_set_fire_woman_niharonline

సహజీవనం పేరటి ఆ మృగం ఓ మహిళను తల్లిని చేసింది. ఫలితం ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. కొంత కాలం తర్వాత  మోజు తీరిన ఆ కర్కశుడు ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. అంతే ఆ క్రమంలో దారుణానికి ఒడిగట్టాడు. భయోత్పాతం స్రుష్టించిన ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. నందివెలుగు గ్రామంలో మణికంఠ అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఏమైయిందో తెలీదుగానీ గురువారం రాత్రి హఠాత్తుగా ఆ మహిళ ఉంటున్న ఇంటికి మంటలు వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి చూడగా మహిళ, రెండేళ్ల బాలుడి మ్రుత దేహలను గుర్తించారు. వారిన హత్య చేసిన మణికంఠ నేరం నుంచి తప్పించుకునేందుకే ఇంటికి నిప్పంటించి ఉంటాడని పోలీసులు తెలిపారు. కాగా, మణికంఠ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ