దుర్మార్గుడు: అత్యాచారం... పెళ్లి... ఆపై హత్య

April 16, 2015 | 10:54 AM | 137 Views
ప్రింట్ కామెంట్
indian_girl_rape_marriage_murder_niharonline

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ రాక్షసుడు పక్కా ప్రణాళికతో ఓ యువతిని మట్టుపెట్టిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ముందుగా యువతిపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమెను పెళ్లిచేసున్నాడు. ఇక తర్వాత ప్లాన్ ప్రకారం ఆమెను కడతేర్చాడు. వివరాళ్లోకి వెళ్లితే... కోసగి మండలం పల్లిపాడుకు చెందిన ఏసు అనే వ్యక్తి గ్రామానికి చెందిన ఓ యువతిపై ఈ ఏడాది జనవరిలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇక కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ మృగం పెళ్లి అనే డ్రామా ఆడింది. బాధితురాలిని ఒప్పించి అదే నెల 21 పెళ్లిచేసుకున్నాడు. ఆ తర్వాత ప్రేమగా చూసుకుంటున్నట్టు నటించి వేరే ఊర్లో కాపురం పెట్టాడు. ఇక పక్కా ప్రణాళిక ప్రకారం మంగళవారం రాత్రి అతగాడు ఆ యువతిని గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరారైన నిందితుడిని అరెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ మానవ మృగం ఊచలు లెక్కిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ