ప్రత్యేక హోదాపై నాయుడు బ్రదర్స్ గేమ్ ఆడుతున్నారట

February 03, 2015 | 12:43 PM | 44 Views
ప్రింట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై అధికార పక్షాలైన తెలుగు దేశం పార్టీ, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్ర సమస్యలపై నెలకోసారి ఢిల్లీ వెళ్లి నేతలను కలుస్తున్నానంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా వెంకయ్య నాయుడు ఏం చేయలేకపోతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. వారిద్దరిని ‘నాయుడు బ్రదర్స్’గా ఆయన అభివర్ణించారు. టీడీపీ, బీజేపీలు జంట తోడేళ్ల మాదిరిగా జనాలను మోసం చేస్తున్నాయని విదేశాలకు టూర్లకు కడుతున్న చంద్రబాబుకు రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటా కోసం ఉద్యమించేందుకు ఆసక్తి లేనట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై ఇప్పటివరకు ఏం చేశారనే అంశంపై శ్వేత పత్రం విడుదలచేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇక కేంద్రమంత్రి హోదాలో ఉండి వెంకయ్యనాయుడు స్వయం లాభం పొందుతున్నాడే తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టిందేం లేదని ఆయన విమర్శించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ