బొత్స గోవా టూర్ అందుకేనా...?

December 02, 2014 | 01:42 PM | 88 Views
ప్రింట్ కామెంట్

పీసీసీ మాజీ చీఫ్ బొత్స నారాయణ ఇప్పుడెక్కడున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ కు హ్యండిచ్చి బీజేపీలో చేరతారనే వార్తలు విన వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో స్పందించాల్సిన ఆయన ఎక్కడా అంటూ కాంగ్రెస్ నేతలంతా కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. ఇక 15 రోజులుగా పత్తా లేకుండ పోయిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలిసిపోయిందండోయి. ప్రస్తుతం సార్ గారూ గోవాలో బిజీగా ఉన్నారంటా. ఎంత బిజీగా అంటే పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేనంతగా. కుటుంబ సభ్యులతో పాటు ఒక్క ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కి మాత్రమే ఆయన టచ్ లో ఉన్నాడట. ఇక ఇక్కడే ఆయన బీజేపీ అగ్రనేతలతో మంతనాలు చేస్తున్నారని సమాచారం. అన్ని కుదిరితే ఈ నెల 20న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయం కప్పేసుకుంటారని అదేనండీ బీజేపీలో చేరతారని సమాచారం. ఇది మన బొత్స గారి గోవా టూర్ సమగ్ర సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ