కేక గురూ... వైజాగ్ పాలిటెక్నిక్ విద్యార్థిగా కేసీఆర్!!

April 16, 2015 | 04:05 PM | 55 Views
ప్రింట్ కామెంట్
kcr_photo_on_vizag_polytechnic_student_hallticket_niharonline

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు. సీమాంధ్ర అంటేనే అంతెత్తున ఎగిరిపడతారు. అలాంటిది సీఎం పదవిలో ఉన్న ఆయనను పాలిటెక్నిక్ చదివే విద్యార్థిగా చేసిపడేశారు ఆంధ్రా అధికారులు. విశాఖపట్నంలోని పాలిటెక్నిక్ కళాశాల అధికారుల నిర్వాకం కారణంగా పాలిటెక్నిక్ చదువుతున్న ఓ విద్యార్థి హాల్ టికెట్ పై కేసీఆర్ ఫోటో దర్శనమిచ్చింది. విశాఖ జిల్లా వరకూ అధికారులు పక్కాగా వ్యవహారించినప్పటికీ, హైదరాబాదులోని సెంట్రల్ సర్వర్ వద్దకు వచ్చేసరికి గిరీశ్ అనే విద్యార్థి విద్యార్థి హాల్ టికెట్ పై కేసీఆర్ ఫోటో వచ్చి చేరింది. పేరు మాత్రం గిరీశ్ దే అయినప్పటికీ ఫోటో మాత్రం కేసీఆర్ దే ఉంది. దీంతో ఆందోళన చెందిన విద్యార్థిని బుజ్జగించిన అధికారులు కేసీఆర్ ఫోటోపైనే గిరీశ్ ఫోటో అంటించి పరీక్షలకు అనుమతించారు. ఇక ఓ అధికారి సమాచారంతో ఈ వ్యవహారం అంతా మీడియాకు చేరింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ