బాబు బిచ్చమెత్తి తిరుగుతున్నారంటా

November 29, 2014 | 01:19 PM | 34 Views
ప్రింట్ కామెంట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ప్రజల దగ్గర నుంచి చందాల రూపంలో హుండీల ద్వారా భిక్షమెత్తుతున్న చంద్రబాబు ఆ సోమ్ముతో విహారయాత్రలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఎన్నికల హామీల నుంచి తప్పించుకోడానికి ప్రజల సొమ్మును ఫలహారంగా తింటూ విదేశాల్లో గడిపేస్తున్నారని విమర్శించారు. తీవ్ర తుఫాన్ తో ప్రజలు ఇక్కడ అష్ట కష్టాలు పడుతుంటే వదిలేసి ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడంటూ ఆరోపించింది. ఆధునిక వ్యవసాయాన్ని అధ్యయనం చేయడానికి జపాన్ వెళ్లనక్కర్లేదని, బాపట్ల వ్యవసాయ కళాశాలలోనే తగినంత సమాచారం అందుబాటులో ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై అడుగడుగునా చంద్రబాబును నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ