మీకు మీరే... మాకు మేమే

November 14, 2014 | 01:11 PM | 89 Views
ప్రింట్ కామెంట్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోజుకో కొత్త వివాదం చెలరేగుతుంది. తాజాగా ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇరు రాష్ట్రల మధ్య జగడం ప్రారంభమైంది. ఉమ్మడిగా పరీక్షలు మార్చి 11వ తేదీ నుంచి నిర్వహిస్తామని గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ తయారు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మరోవైపు శుక్రవారం అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఈ అంశంపై చర్చించారు. ఎట్టి పరిస్థితిల్లో ఇంటర్ పరీక్షలను తామే నిర్వహించుకుంటామని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ