చర్చించి ఎత్తేస్తారట!

November 17, 2014 | 01:14 PM | 38 Views
ప్రింట్ కామెంట్

టీటీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రగడ అంతా ఇంతా కాదు. ఇదే అంశాన్ని అస్ర్తంగా చేసుకుని నిన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శిస్తే, ముఖ్యమైన అంశాలు చర్చించాల్సి ఉన్నందున వేటు ఎత్తేయాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది. తాజా వార్త ప్రకారం దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశంపై సభలో చర్చించి, వేటును ఎత్తేస్తుందని సమాచారం. అయితే టీడీపీ సభ్యులు సభకు ఎట్టిపరిస్థతుల్లో క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని, తర్వాతే వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అధికార సభ్యులు పట్టబడుతున్నారు. మొత్తానికి ఈ చర్చ మరిన్నీ విమర్శలకు వేదిక కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ