జక్కన్నను మించిపోతున్న వినాయక్

November 21, 2014 | 03:38 PM | 24 Views
ప్రింట్ కామెంట్

టాలీవుడ్ డైరక్టర్ లలో టాప్ ఎవరంటే వినిపించే మొదటిపేరు ఎస్.ఎస్.రాజమౌళి. సినిమా కోసం ప్రాణం పెట్టి అనుకున్న అవుట్ పుట్ ను సాధించడంలో జక్కన్నను మించినవారు లేరు. ప్రస్తుతం రెమ్యూనరేషన్ పరంగా కూడా ఆయనే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ, ఇప్పుడా రికార్డు బద్ధలు అయ్యేలా ఉంది. మాస్ యాక్షన్ డైరక్టర్ వి.వి.వినాయక్ రాజమౌళి కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని ఫిల్మింనగర్ టాక్. బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ ఆరంగ్రేటం అల్లుడు శీను చిత్రం కోసం భారీ మొత్తంలో పారితోషకాన్ని తీసుకున్న వినాయక్. ఇప్పుడు కింగ్ నాగార్జున రెండో తనయుడు అఖిల్ ఆరంగ్రేటం కోసం కళ్లు చెదిరే రేంజ్ లో పారితోషకం తీసుకొబోతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మనోడు జక్కనను (పారితోషకం విషయంలో) మించిపోవడం ఖాయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ