రజనీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకేనట

November 22, 2014 | 02:15 PM | 47 Views
ప్రింట్ కామెంట్

లింగా సినిమా కథ విషయంలో చెలరేగుతున్న వివాదంపై సూపర్ స్టార్ రజనీకాంత్ గరం అయ్యాడు. తన ఇమేజ్ ను దెబ్బతీయడానికే ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆగ్రహాం వ్యక్తంచేశాడు. చిత్ర కథ తనదేనంటూ వీ.రవి రథినం అనే వ్యక్తి మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముళ్లపెరియార్ డ్యాం రూపకర్త బ్రిటిష్ ఇంజనీర్ జాన్ పెన్నీకుయిక్ జీవిత కథతో తాను రూపొందించిన ముళ్లై 999 కథ లింగా చిత్రం ఒకటేనని పిటిషన్ లో ఆరోపించాడు. దీనిపై రజనీ స్పందిస్తూ... తన పేరును, ఖ్యాతిని దెబ్బతీసేందుకే ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశాడు. అంతేకాదు రూల్స్ ప్రకారం ఈ సినిమా కథ కాపీయో కాదో తేల్చేందుకు అందులోని 13 వరుస సీన్లు ఫిర్యాదు చేసే వ్యక్తి కథతో పోలిస్తే ఒకేలా ఉంటే ఆ ఆరోపణలు నిజమవుతాయి అంటూ కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. మరి రజనీకాంతంటే ఏమనుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ