మంచి కోసం మంచువారి సవాల్

November 22, 2014 | 03:12 PM | 37 Views
ప్రింట్ కామెంట్

దేశ ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛ్ భారత్ లో సెలబ్రిటీలు చురుకుగానే పాల్గొంటున్నారు. అంతటితో ఆగక ఒకరు ఇంకోకరికి ఆ ఒకరు ఇంకొకరికి సవాలు విసురుకొవడం ఇలా ఈ గొప్ప కార్యం ముందుకు సాగుతూనే ఉంది. బాలీవుడ్ లో ప్రారంభమైన ఈ సవాళ్ల పరంపర తాజాగా టాలీవుడ్ లో కూడా ప్రవేశించింది. రామ్, తమన్నా, సమంతా ఇలా వరుసగా సవాళ్లను స్వీకరిస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ సవాలు మంచువారి నుంచి పలువురికి వెళ్లింది. నటుడు మోహన్ బాబు తిరుపతిలో స్వచ్ఛ్ భారత్ నిర్వహించి తన చిరకాల స్నేహితుడు రజనీకాంత్ కి సవాలు విసరగా, ఇప్పుడు మంచు వారసులు తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ, మనోజ్ లు ఫిల్మింనగర్ లోని ఓ బస్తీలో స్వచ్ఛ్ భారత్ లో పాల్గొన్నారు. అనంతరం ఈ సవాలును స్వీకరించాల్సిందిగా నటుడు రాంచరణ్, జూ.ఎన్టీఆర్ తోపాటు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, నటలు నాని, అల్లరి నరేశ్ లకు విసిరారు. మాటల తూటాలు విసిరే మంచు ఫ్యామిలీ నుంచి ఒక మంచి పనికోసం సవాలు రావడం హర్షించదగ్గ విషయమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ