మేము సైతంలో తారల క్రికెట్ హీరో అఖిల్

November 29, 2014 | 04:35 PM | 35 Views
ప్రింట్ కామెంట్

హుదూద్ బాధితుల సహాయార్థం సినీ రంగం తల పెట్టిన ‘మేము సైతం’ కార్యక్రమంలో తారల క్రికెట్ ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. నటనలో పోటీ తెరపై చూడ్డం మామూలే... ఈ మధ్య కాలంలో కొందరు హీరోలు క్రికెట్ లోనూ హీరోలమనిపించుకుంటున్నారు. ఇంకా తెరమీదకు రాని అఖిల్ కు సిసిఎల్ తో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు అతని స్థానం పెద్ద హీరోల పక్కనే. హీరోలు ఆడనున్న క్రికెట్ మ్యాచ్ వివరాలు వెల్లడించేందుకు ఇటీవలే నాలుగు టీమ్‌ల తరపున క్యాప్టెన్లు ఒక్కచోట చేరి ప్రెస్‌మీట్ నిర్వహించారు. వెంకీ, నాగ్, చరణ్, ఎన్టీఆర్‌లు ఈ నాలుగు టీములకు క్యాప్టెన్లు కాగా, ఈ ప్రెస్‌మీట్‌కి వెంకీ, చరణ్‌లు నేరుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ టీమ్ తరపున హీరో శ్రీకాంత్, నాగార్జున టీమ్ తరపున అఖిల్ హాజరయ్యాడు. కాగా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ మహత్తరమైన వినోద కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఇందుకు గాను సదరు టీవీ చానెల్ 3.5 కోట్లు చెల్లిస్తోందట. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రమేయంతోనే ఈ హక్కులు జెమినీ టీవీకి వెళ్లాయని అంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ