సైలెంట్ గా స్టార్టైన నాగ్ కొత్తచిత్రం

November 20, 2014 | 10:54 AM | 38 Views
ప్రింట్ కామెంట్

టాలీవుడ్ కింగ్ నాగార్జున అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం ఏ హడావుడి లేకుండా ప్రారంభమైంది. కళ్యాణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాధామోహన్ స్ర్కీన్ ప్లే రాశారు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నాయికలుగా నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని నాగ్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. మనం చిత్రం కోసం ఉపయోగించిన సెట్ నే చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రానికి వాడుతున్నట్లు తెలిపాడు. ఇక ఈ చిత్రంలో నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అల్లరి చిల్లరగా తిరిగే మాస్ పాత్రలో, జెంటిల్ మెన్ గా ఉంటూ అమ్మాయిలను అసహ్యించుకునే పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో వచ్చిన నాగార్జున ‘హాలోబ్రదర్’ చిత్రంలాగానే ఇది కూడా పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉంటుందని దర్శకుడు కళ్యాణ్ తెలిపాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ