రెడీ ఫర్ రిలీజ్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’

November 29, 2014 | 04:00 PM | 51 Views
ప్రింట్ కామెంట్

నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటిగా నిలిచిన నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్, ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థలో ప్రస్తుతం రూపొందుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు సమర్పణలో సి.సి. మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ పతాకంపై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. పాండిచ్ఛేరిలో చిత్రీకరించిన ’ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై విరసిల్లే...’ పల్లవితో సాగే పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రముఖ గీత రచయిత సాహితి రచించిన పాటకి ప్రముఖ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ నృత్యాన్ని సమకూర్చారు. పాండిచ్చేరిలో హీరో శర్వానంద్, హీరోయిన్ నిత్యామీనన్లపై మెలోడీ పాటను అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. త్వరలోనే ఆడియో, సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కె.యస్.రామరావు మాట్లాడుతూ ‘‘మా బ్యానర్లో వస్తున్న మరో బ్యూటీఫుల్ యూత్ లవ్ స్టోరి. డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేమ గొప్పతనాన్ని తెలియజేసే చిత్రం. శర్వానంద్, నిత్యామీనన్ వంటి వెర్సటైల్ ఆర్టిస్టులు సినిమాలో నటించం హ్యాపీగా ఉంది. పాండిచ్చేరిలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన మెలోడీ సాంగ్ చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తయింది. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మలయాళంలో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన గోపిసుందర్ సినిమాకి అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. క్రాంతిమాధవ్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో ఆడియో, సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ