హీందీ దృశ్యంలో సోనాక్షి

November 28, 2014 | 12:45 PM | 36 Views
ప్రింట్ కామెంట్

మలయాళ, తెలుగు భాషల్లో హిట్ గా నిలిచిన దృశ్యం చిత్రాన్ని అజయ్ దేవగన్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ఇప్పుడి ఈ చిత్రానికి హీరోయిన్ గా ‘మోస్ట్ వాంటెడ్’ సోనాక్షిని ఎంపిక చేసినట్లు సమాచారం. మలయాళ, తెలుగు భాషల్లో మీనా పోషించిన పాత్రను సోనాక్షి సిన్హా చేయనుంది. సోనాక్షి సక్సెస్ రేటులో చాలా వరకు రీమేక్ చిత్రాలే ఉండటంతో ఈమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక మాతృక చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ఇక కథలో చాలా వరకు మార్పులు చేసినట్లు సమాచారం. చిత్రంలో కథానాయకుడి కూతురి చుట్లు కథ అల్లుకొని ఉండగా, హిందీలో మాత్రం చెల్లెలి పాత్ర చుట్టు తిరుగుతుందట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ