బ్యాటింగ్ పొజిషన్ పై కోహ్లీకి ధోనీ క్లాస్

January 30, 2015 | 12:31 PM | 132 Views
ప్రింట్ కామెంట్

జట్టు ప్రయోజనాల కోసం కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి ఉంటుందని, ఎప్పుడూ ఒకే స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకోవటం సరికాదని వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సూచించాడు. త్వరలో వరల్డ్ కప్ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్ పై ప్రశ్నలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. తుది జట్టులో ఉండే 11 మందిలో ఎవరు ఎక్కడ ఆడినా, జట్టుకు లాభం కలగడం ముఖ్యం. అందువల్ల తనకు నచ్చిన స్థానంలో ఆడుతున్న ఆటగాడు ఒక్కోసారి త్యాగం చేయాల్సి రావచ్చు అని పేర్కొన్నాడు. కాగా, ఆసీస్ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన కోహ్లీ, వన్డే సిరీస్ లో మాత్రం విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్ లలో కలిపి కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో కోహ్లీ పొజిషన్ మారుస్తూ ఉండటం పట్ల టీం మేనేజ్ మెంట్ పై విమర్శలు పెరుగుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ