కాంగ్రెస్ ఏ తప్పులు చేయలేదు

November 13, 2014 | 04:51 PM | 154 Views
ప్రింట్ కామెంట్

కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తప్పులు చేయలేదని, కేవలం అందులో ఉన్న కొందరు నేతలే తప్పులు చేశారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలలో ఎలాంటి లోపం లేదంటూ ఢిల్లీలోని తల్కొటొరా స్టేడియంలో నిర్వహించిన నెహ్రూ 125వ జయంతి ఉత్సవాలలో ప్రసంగించారు. స్వాతంత్రొద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ నేతలు శాంతి మార్గాన్ని వీడలేదని, తాను కూడా దేశం కోసం తనలోని కోపాన్ని అణుచుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం దేశాన్ని ఆగ్రహం, దూకుడులతో ఉన్న వ్యక్తులు పరిపాలిస్తున్నారని, అప్రమత్తంగా ఉండకపోతే శత్రువులు బలపడతారని ఆవేశపూరితంగా ప్రసంగించారు. కేవలం ప్రచారం కోసమే వీధులను శుభ్రం చేస్తున్నారని, స్వచ్ఛ్ భారత్ ద్వారా సమాజంలో వారు విషం చిమ్ముతున్నారంటూ విమర్శించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ