కేజ్రీవాల్ కు బేడీ లీగల్ నోటీసులు

January 27, 2015 | 05:54 PM | 137 Views
ప్రింట్ కామెంట్

బీజేపి ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు లీగల్ నోటీసులు పంపారు. ఢీల్లీలో భారీ సంఖ్యలో తిరిగే ఆటో రిక్షాలపై ఈ పోస్టర్ల ను ఆప్ అంటించింది. సీఎంగా కేజ్రీవాల్ కావాలో, కిరణ్ బేడీ కావాలో తేల్చుకోవాలంటూ ఈ పోస్టర్లలో పేర్కొంది. కాగా ఆ పోస్టర్లలో కేజ్రీవాల్ చిత్రం కింద నిజాయితీపరుడు అని కిరణ్ బేడి చిత్రం కింద అవకాశవాది అని రాసి ఉన్నట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఆప్ పోస్టర్లలో తన ఫొటోను వాడుకున్నారని, పోస్టర్లను తొలగించాలని కోరారు. దీనిపై బీజేపీ మీడియా కన్వీనర్ ప్రవీణ్ శంకర్ కపూర్ మాట్లాడుతూ, అవును ఆమె కేజ్రీవాల్ కు నోటీసులు పంపారు. పోస్టర్ల తొలగింపుపై హామీ ఇవ్వాల్సిందిగా కోరారు అని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ