వారిద్దరిని అనర్హులుగా ప్రకటించాల్సిందే

November 18, 2014 | 11:22 AM | 34 Views
ప్రింట్ కామెంట్

తమ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచి ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, చెవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత కే. జానారెడ్డి స్పీకర్ ఎస్ మధుసూధనాచారిని కోరారు. అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు కేటాయించిన సీట్లలో కూర్చుంటున్నారని, ఈ వ్యవహారం అంతా స్పీకర్ సమక్షంలోనే జరుగుతుందని గుర్తుచేశారు. ఫిరాయింపులను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొత్సహించడం విచారకరమని, తక్షణమే వారిపై వేటువేయాలని స్పీకర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ