సెట్ గందరగోళానికి తెరదించండి

January 01, 2015 | 10:28 AM | 35 Views
ప్రింట్ కామెంట్

ఎంసెట్‌పై నెలకొన్న గందరగోళాన్ని నివారించేందుకు గవర్నర్ నరసింహన్ ప్రయత్నాలు ప్రారంభించారు. అవసరమైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెరో ఏడాది ఎంసెట్ నిర్వహణను చేపట్టాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. లేకపోతే పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను పరిశీ లించి, దాని ప్రకారం ముందుకెళ్లాలని.. మొత్తంగా విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా వ్యవహరించాలన్నారు. మంగళవారం ఉదయం గవర్నర్ తో ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. అనంతరం గవర్నర్ కార్యాలయం నుంచి అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి సమస్యపై చర్చించినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి... సాయంత్రం తానే స్వయంగా వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి, ఎంసెట్ విషయంలో తలెత్తిన సమస్యలను వివరించారు. పరీక్షను ఎవరు నిర్వహించాలన్న దానిప ఇరు రాష్ట్రాల కార్యదర్శుల సమావేశం నిర్వహించి, నిర్ణయం తీసుకుందామని తాము ఏపీ విద్యామంత్రికి తెలిపామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. కానీ, ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించిందని గవర్నర్‌కు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీతో కలిసి ముందుకు సాగడం కష్టమని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో వీలైతే చెరో ఏడాది ఎంసెట్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రెండు రాష్ట్రాలకు గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ