పెళ్లి పీటల మీదే ఛీకొట్టిన వధువు

April 14, 2015 | 11:57 AM | 120 Views
ప్రింట్ కామెంట్
bride_rejected_bridegroom_niharonline

ఇంకొన్ని గంటల్లో పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తూ కలల్లో విహరిస్తున్న వధువు... కాబోయే భర్త తీరు చూసి ఛీ అనుకుంది. అలాంటి మొగుడు తనకొద్దని పెళ్లిని ఆపేసింది. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్, ఎఫ్ సీఐ కాలనీకి చెందిన మీనాక్షి వివాహం జక్రాన్ పల్లికి చెందిన సాయికుమార్ తో నిశ్చయం అయింది. ముందుగా అనుకున్న ప్రకారం కట్న కానుకలు కూడా ఇచ్చారు. పెళ్లికి ముందు రోజు తనకు సరైన స్వాగతం పలకలేదని ఆరోపిస్తూ... అదనంగా మరో రూ.2 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి పీటలు ఎక్కుతానని మొండికేశాడు. విషయం తెలుసుకున్న వధువు ఈ పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో, వరుడిని అరెస్ట్ చేసి చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ