స్వప్రయోజనాల కోసమే ఫిరాయింపులు

November 19, 2014 | 02:15 PM | 43 Views
ప్రింట్ కామెంట్

సిద్ధాంతాలను నమ్ముకునే వారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లరని... వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వలస వెళతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వలసలు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. వారంతా వారి వారి స్వలాభం కోసమే పార్టీని విడిచి వెలుతున్నారని, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు కాంగ్రెస్ పార్టీ అడ్డురాదని చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా మాట్లాడుతూ... తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ