కాంగ్రెస్ లోకి కేసీఆర్ అన్న కూతురు

January 14, 2015 | 05:14 PM | 39 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సొదరుడైన కే. రంగరావు కూతురు రమ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెకు సభ్యత్వాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పొన్నాల. రమ్య చేరికతో కేసీఆర్ ను ఢీకొనడానికి మంచి అవకాశం లభించినట్లయ్యిందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. గతంలో ఆమె తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ లో ఉండేవారు. ఆ సమయంలో కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు తనపై భౌతికదాడికి పాల్పడే అవకాశం ఉందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేశ్ రెడ్డిలను ఆశ్రయించింది. టీఆర్ఎస్ ఆవిర్భావంలో రమ్య తండ్రి స్వర్గీయ రంగారావు కీలకపాత్ర పొషించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ