కిషన్ జీ... అది అయ్యే పనేనా?

January 13, 2015 | 01:16 PM | 13 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ రాష్ట్రం లో పెద్దగా ప్రభావం లేని పార్టీని ఓ రేంజ్ కు తీసుకెళ్తా అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదుచేయటమే తమ ముందున్న లక్ష్యమని ఆయన చెబుతున్నారు. స్వామీ వివేకానంద 152వ జయంతి సందర్భంగా పార్టీ ఆన్ లైన్ సభ్యత్వాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రారంభించి తొలిరోజే 10 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. రాష్ర్టవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 35 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించటం టార్గెట్ గా పెట్టుకున్నారని తెలిపారు. అవసరమయితే కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి నమోదు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయతోపాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఇటీవల అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆయన పార్టీ కేడర్ పై తీవ్రఅసంత్రుప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పాపులారిటీతో ఈ కార్యక్రమం విజయవంతం చేయటం సాధ్యమయ్యేదేనా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇంకోవైపు కిషన్ రెడ్డి చేసేది ఆచరణసాధ్యంకానిదని పలువురు నేతలు బహిరంగంగానే ఎద్దేవా చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ