ఎంపీలపై టీ సర్కార్ వరాల జల్లు

December 27, 2014 | 05:58 PM | 48 Views
ప్రింట్ కామెంట్

పార్లమెంట్ సభ్యులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రతి ఎంపీకి రాష్ట్ర ఎమ్మెల్యేల తరహాలో భద్రత, వాహన సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. అంతేకాదు వంట తదితర అవసరాల కోసం నెలకు రూ.50 వేలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఎంపీలు కూడా తమ నియోజకవర్గాల్లో విస్తారంగా తిరిగి ప్రజా సమస్యలను పరిశీలిస్తారనే కోణంలో వారికి సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయమై గతంలో కొందరు ఎంపీలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఈ మేరకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ ఇప్పుడిలా వరాలు ప్రకటించేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ