కాంగ్రెస్ కు హ్యాండిచ్చి కారెక్కుతాడా?

December 26, 2014 | 11:25 AM | 21 Views
ప్రింట్ కామెంట్

దివంగత నేత పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారా? ప్రస్తుతం కాంగ్రెస్ లో చెలరేగిన కలకలం చూస్తుంటే కరెక్టేమో అనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా క్యాంపు కార్యాలయానికి వెళ్లి కలవటం దీనికి మరింత ఊతమిస్తుంది. తన తండ్రి వర్థంతి కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ కొరానని, ఐమాక్స్ ఎదురుగా ఉన్న పార్క్ కు పీజేఆర్ పేర్కు పెట్టాలని కోరానని విష్ణు చెబుతున్నాడు. కానీ, ఇటీవల ఓ సొంతపార్టీ ఎమ్మెల్యేతో జరిగిన వివాదం నేపథ్యాంశంగానే సీఎంను కలిశాడనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో విసిగిన విష్ణు కాంగ్రెస్ కు హ్యండిచ్చి, త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటాడని తెలియవస్తుంది. ప్రస్తుతం విష్ణు సోదరి విజయా రెడ్డి కూడా టీఆర్ఎస్ లోనే ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ