భాగ్యనగరంలో మూగబోయిన ఎయిర్ టెల్

January 24, 2015 | 10:46 AM | 64 Views
ప్రింట్ కామెంట్

ఎయిర్ టెల్ సేవలు హైదరాబాద్ నగరంలో స్తంభించాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఎయిర్ టెల్ సేవల్లో నెలకొన్న అంతరాయం వల్ల ఎయిర్ టెల్ వినియోగదారుల సెల్ ఫోన్లు మూగబోయాయి. సమాచారం అందుకున్న ఎయిర్ టెల్ సంస్థ వెనువెంటనే రంగంలోకి దిగింది. యుద్ధ ప్రతిపాదికన సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. అయితే ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సేవల అంతరాయానికి గల కారణాలు తెలియరాలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ